గ్యాస్ సిలెండర్ ధరలు మరొక సారి పెరిగేటట్లు కనపడుతోంది. రానున్న రోజుల్లో సిలిండర్ ధర భారీగా పెరగవచ్చని అంటున్నారు. ఇదే కనుక జరిగితే సామాన్యులకి మరింత కష్టం అవుతుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత సిలిండర్ ధర భారీగా పెరగొచ్చని అంటున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే ముడి చమురు ధర బ్యారెల్కు 92 డాలర్ల పైకి చేరింది. కానీ ఇంకా గ్యాస్ సిలెండర్ ధరలో ఏ మార్పు లేదు. 2021 అక్టోబర్ 6వ తేది నుంచి ధర స్థిరంగానే వుంది. ధరలలో ఎలాంటి మార్పు కూడా రాలేదు. ఇదిలా ఉంటే మార్చి 10వ తేది తర్వాత గ్యాస్ సిలిండర్ ధర రూ.100కు పైగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే సామాన్యులపై ఎఫెక్ట్ పడుతుంది. 2021 అక్టోబర్ నుంచి 2022 ఫిబ్రవరి 1 వరకు చూస్తే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.170 పైకి చేరింది. అక్టోబర్ 1న ఈ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1736 వద్ద ఉండేది. ఇక నవంబర్ కి వచ్చే సరికి రేటు రూ.2 వేలకు చేరింది. అదే డిసెంబర్లో అయితే రూ.2101కు వెళ్ళింది. ఇక జనవరి, ఫిబ్రవరి నెలల్లో ధర తగ్గింది. ఇప్పుడు ఈ సిలిండర్ ధర రూ.1907 వద్ద వుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa