ఒకప్పుడు ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు విలాసవంత వస్తువులుగా ఉండేవి. కానీ నేడు మాత్రం అవి రోజువారీ అవసరాలుగా మారిపోయాయి. దేశంలో టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలకు డిమాండ్ బాగా పెరిగింది. అయితే వివిధ కారణాలతో వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయినా వీటిని కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం వీటన్నింటినీ కన్స్యూమర్ గూడ్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ జాబితాలో టీవీలు, ఎయిర్ కండీషనర్లు, ఫ్రిడ్జ్లు, వాటర్ హీటర్లు మొదలైనవి ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వీటి ధరలు 5 నుంచి 7 శాతం మేర పెరిగే అవకాశం ఉందని వివిధ కంపెనీల ప్రతినిధులు తెలిపారు. 2022 సంవత్సరంలోని మొదటి క్వార్టర్లోనే సామాన్యులకు ఈ ధరల వల్ల షాక్ తగలనుంది. ఇది వరకే కరోనాతో అతలాకుతలమవుతున్న సామాన్యులకు కన్స్యూమర్ గూడ్స్ ధరల పెంపు నిజంగా భారమనే చెప్పాలి. త్వరలోనే ధరలను 5 నుంచి 7 శాతం మేర పెంచుతామని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లికేషన్స్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) ఒక ప్రకటనలో తెలిపింది. ఇక CEAMA తెలిపిన తర్వాత ధరల పెరుగుదల తప్పనిసరిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధరలను పెంచాలని పలు కంపెనీలు భావించినప్పటికీ పండుగల సీజన్ కావడం వలన ధరల పెరుగుదలను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం కచ్చితంగా ధరలు పెంచుతామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa