మంగళగిరి - తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎన్నారై ఆసుపత్రి వద్ద శనివారం అర్ధరాత్రి సమయంలో కారు, ద్విచక్ర వాహనదారునికి వివాదం జరిగింది. ఘటనలో డిఐజి ఉత్తర్వుల మేరకు తప్పు చేసిన ద్విచక్ర వాహన దారుడిని వదిలేసి తనపై కేసు నమోదు చేశారని కారులోని వ్యక్తి వాపోయాడు. సేకరించిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన కుటుంబసభ్యులు ఎన్నారై ఆసుపత్రికి వెనుకవైపు ఉన్న ఓ అపార్ట్మెంట్ లో జరిగిన శుభకార్యానికి హాజరై శనివారం రాత్రి తిరుగుప్రయాణం అయ్యారు. ఎన్నారై ఆసుపత్రి దాటి రోడ్డు పైకి వచ్చేసమయంలో కారుకు అడ్డుగా ద్విచక్ర వాహనం వచ్చింది. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి వేగంగా కారు వద్దకు వచ్చి కారులో ఉన్న వ్యక్తులపై దుర్బాషలాడినట్లు తెలిపారు. అంతేకాకుండా డ్రైవర్ పై దాడికి పాల్పడ్డాడు.
అయితే సదరు విషయాన్ని కారు యజమాని మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ లోపుగా ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి ఉన్నత అధికారి సిబ్బంది చేత ఫోన్ చేయించగా, తప్పు ఒప్పులు చూడకుండా గాయాలపాలైన కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని, కారును స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపాడు. తప్పు తనవైపు లేకున్నా పోలీసులు కావాలనే ఇలా చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని బాధితుడి కోరాడు. అయితే విషయం మీడియాకు తెలియడంతో రాజీ కుదిర్చి పంపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa