ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి ఇప్పటికే రూ.23.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 12:58 PM

గత 18 నెలల్లో కూటమి ప్రభుత్వం రూ.23.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుందని, దీని ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని లోకేశ్ తెలిపారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రావడం గర్వకారణమని, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ఇప్పుడు నంబర్ 1 స్థానంలో ఉందని అన్నారు.తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడి, ఢిల్లీని సైతం దద్దరిల్లేలా చేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం వల్లే తెలుగుజాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అభివృద్ధిని జోడించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని లోకేశ్ అన్నారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ కంపెనీలు నేడు ఏపీ వైపు చూస్తున్నాయంటే దానికి కారణం 'బ్రాండ్ సీబీఎన్' అని స్పష్టం చేశారు.సీఎం చంద్రబాబుకు ఉన్న విజన్ కారణంగా ఆయన్ను ఏ విషయంలో అయినా గుడ్డిగా అనుసరించవచ్చని లోకేశ్ అన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కొందరు విమర్శిస్తారని, కానీ భవిష్యత్తులో అవే అభివృద్ధి ఫలాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు జీపీఎస్ లాంటివారని, ఆయన నాయకత్వంలో తామంతా ఒక యంగ్ టీంగా ఎటువంటి ఈగోలు లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. ఆయన విజన్ సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు.'బ్రాండ్ సీబీఎన్', 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్', ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని 'డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్' వల్లే కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయని వివరించారు. గుజరాత్, ఒడిశా మాదిరిగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యమని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa