ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరుచూరి బ్రదర్స్ ను పరిశ్రమ పక్కనెట్టింది: పోసాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 14, 2022, 01:00 AM

పరుచూరి బ్రదర్స్ చిత్ర పరిశ్రమ పక్కనెట్టిందని రచయిత పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తంచేశారు. మోహన్ బాబు హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరుచూరి బ్రదర్స్ వద్ద ఐదేళ్ల పాటు సహాయకుడిగా పనిచేశానని వెల్లడించారు. అందరూ వాళ్లకు అహంభావం ఎక్కువ అని అంటారని, అందులో వాస్తవంలేదని స్పష్టం చేశారు. వాళ్లు ఎలా బతకాలో తెలియని మనుషులని అన్నారు. చిత్ర పరిశ్రమను చూసిన తర్వాత వాళ్లలా మాత్రం బతకకూడదని నిర్ణయించుకున్నానని పోసాని వివరించారు. పరుచూరి బ్రదర్స్ రెండు రెండుదశాబ్దాల పాటు కొన్ని వందల చిత్రాలకు పనిచేశారని, అలాంటివాళ్లను చిత్ర పరిశ్రమ దూరంగా పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ గీత రచయిత ఆత్రేయకు కూడా ఇదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. చిత్రపరిశ్రమలో చావు కూడా ఖరీదైన వ్యవహారంగా ఉండాలని, పేదరికంలో చస్తే పది మంది కూడా రారని, ఉన్నవాడు చస్తే పది వేల మంది వస్తారని అన్నారు. ఈ రెండు చావుల మధ్య ఉండడం ఇష్టంలేక తాను, తన కుటుంబం దూరంగా ఉంటున్నామని తెలిపారు. పరుచూరి బ్రదర్స్ వద్ద నుంచి వచ్చేసిన తర్వాత నేను నేనుగా బతకాలని ప్రయత్నించా అని వెల్లడించారు. అయితే, సినీ పరిశ్రమ వల్ల రెండు తరాలు కూర్చుని తినగలిగేంత సంపాదించానని పోసాని వెల్లడించారు. సినీ రంగం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa