ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీనగర్ విమానాశ్రయ సమీపంలో ఉగ్రదాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2017, 08:07 AM

శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని బీఎస్ఎఫ్ ట్రాన్సిట్ క్యాంప్‌పై మంగళవారం తెల్లవారుజామున దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఓ ఉగ్రవాదిని జవాన్లు కాల్చి చంపారు.తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో బీఎస్ఎఫ్ 182 బెటాలియన్ క్యాంపులోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. భద్రతా దళాలు వారిని నిలువరించడంతో క్యాంపస్‌లోని ఓ భవనంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రదాడి కారణంగా ఎయిర్‌పోర్టు వైపు వాహనాలను, వ్యక్తులను అనుమతించడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa