ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దినకరన్ వర్గానికి మద్రాస్ హైకోర్టులో ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 05, 2017, 11:43 AM

దినకరన్ వర్గానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది.  12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై….స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. అంతేకాదు పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలపై కాకుండా కేవలం దినకరన్ ను సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలపై మాత్రమే ఎందుకు వేటు వేశారని ప్రశ్నించింది న్యాయస్థానం. అయితే తమిళనాడు స్పీకర్ ధన్ పాల్…తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు యత్నించారని, అందుకే వేటు వేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. దినకరన్ వర్గం తరుపున కాంగ్రెస్ నేత సంఘ్వీ వాదనలు వినిపించారు. ఓపీఎస్ వర్గంపై వేటు వేసేందుకు ఆరు నెలలు వేచి చూసిన స్పీకర్….దినకరన్ వర్గంపై మాత్రం 2 రెండు రోజుల్లోనే చర్యలు ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa