ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ పై ఏపీ ప్రభుత్వం కక్ష కట్టింది: నటుడు నాగబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 26, 2022, 09:35 PM

ఏపీ ప్రభుత్వ వైఖరిపై మెగా బ్రదర్ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమను, పవన్ కళ్యాణ్ ను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ నుంచి భీమ్లా నాయక్ సినిమా వరకు పవన్ పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందని విరుచుకుపడ్డారు. సినిమా టికెట్ ధరలపై జీవో విడుదల చేయడం లేదని మండిపడ్డారు. జీవో విడుదల విషయంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. పవన్ పై పగబట్టి ఇలా చేస్తున్నా ఎవరూ నోరు మెదపడం లేదని నాగబాబు ఆగ్రహించారు. సినిమా పెద్దలు పవన్ కు మద్దతు ఇవ్వకపోవడం దురదృష్టకరం అని అన్నారు. ప్రజలు శాశ్వత అధికారం ఇవ్వలేదని, ప్రభుత్వం ఉండేది ఐదేళ్లే అనే విషయాన్ని వైసీపీ గుర్తుంచుకోవాలని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa