ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్-చైనా ప్రజల మధ్య ఘర్షణ

international |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 05:19 PM

ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఉక్రెయిన్‌ దేశంలోని పలు నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంటూ వస్తోంది. ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా రష్యా దాడులను పూర్తి స్థాయిలో ఆపలేకపోతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు స‌మీపంలో ర‌ష్యా సేన‌లు ప్ర‌వేశించ‌డంతో ఇరు దేశాల సైన్యం మధ్య భీక‌ర పోరు సాగుతోంది. ఈ క్రమంలో ప్రజలంతా బంకర్లు, అండర్ గ్రౌండ్‌లలో తలదాచుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉక్రెయిన్ ప్రజలు, చైనీయుల మధ్య తాజాగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై చైనా ప్రభుత్వం స్పందించింది. చైనా రాయబారి ఫ్యాన్ షియాన్ రాంగ్ ఉక్రెయిన్‌లో ఉన్న చైనీయులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారితో ఘర్షణలు పెట్టుకోవద్దని తమ దేశ ప్రజలకు సూచించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన 6 వేల మంది చైనీయులను ప్రస్తుతం స్వదేశానికి తరలించలేమని స్పష్టం చేశారు. పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎక్కడి వారు అక్కడే ఉండాలన్నారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa