సాకేంతికంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ నేరాస్థులు కూడా కొత్త కొత్త సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించిన ఎక్కడో ఒక చోట అమాయక ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారు.
తాజాగా విజయవాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఓ యువకుడికి ఏడు క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఇటీవల తన కార్డుల నుంచి 2 లక్షల 47 వేల రూపాయల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఫోన్కు మెసేజ్ వచ్చింది. తన ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పకపోయినా లావాదేవీలు ఎలా పూర్తయ్యాయో ఆ యువకుడికి అర్థం కాలేదు. ఆ యువకుడి నుంచి ఫిర్యాదు అందుకుని విచారణ చేసిన పోలీసులు.. తమిళనాడు, అసోం రాష్ట్రాల్లో లావాదేవీలు జరిగినట్లు నిర్ధరించారు. ఆమెజాన్ ఓచర్లను కొనుగోలు చేసిన నిందితులు, వాటిని తమ అవసరాలకు వాడినట్లు దర్యాప్తులో తేల్చారు. అలాగే విజయవాడకు చెందిన ఓ బ్యాంకు అధికారి క్రెడిట్ కార్డు నుంచి 2 లక్షల 53 వేల రూపాయల షాపింగ్ చేసినట్లు ఫోన్కు సందేశం వచ్చింది. ఆన్లైన్ సైట్ ద్వారా వివిధ ఉత్పత్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. విదేశాల్లో ఉండే నిందితులు ఈ మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది.
అయితే, "చాలాసార్లు గూగుల్, యూట్యూబ్లలో ఫేక్ ప్రకటనలు కనిపిస్తుంటాయి. వీటిలో ఎక్కువ ధర కలిగిన వస్తువులు తక్కువ ధరకు వస్తాయని చెబుతుంటారు. నకిలీ యాంటీవైరస్ ప్రకటనలు కూడా వస్తున్నాయి. అవన్నీ నమ్మి మీరు వాటిని సబ్స్ర్కైబ్ చేసి.. మీ క్రెడిట్ కార్డు నంబరు నమోదు చేస్తే డబ్బులు పోయినట్టే. ఆన్లైన్లో నగదు బదిలీలు చేయడానికి ఓటీపీ అవసరం. ఇది ఆర్బీఐ సూచనలమేరుకు వచ్చింది. కేవలం భారత్లో మాత్రమే ఉంది. కొన్ని దేశాల్లో ఈ ఓటీపీ అవసరం లేదు. మీ క్రెడిట్ కార్డు నెంబర్, సీవీవీ నెంబర్, ఎక్స్పైరీ తేదీ ఉంటే చాలు. ఖాతా నుంచి డబ్బులు తీసుకోవడానికి గానీ, వస్తువులు కొనుగోలు చేయడానికి గానీ ఉపయోగపడుతుంది." అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సాయిసతీష్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa