ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయిల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు..అరకొటికి పైగా నష్టం

national |  Suryaa Desk  | Published : Wed, Mar 02, 2022, 04:09 PM

రాజస్థాన్ లో చోటుచేసుకొన్న అగ్ని ప్రమాదంతో అరకోటికి పైగా ఆస్థి నష్టం జరిగింది. రాజస్థాన్‌లో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. భిల్వారా జిల్లాలోని ఓ ఆయిల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. దీంతో పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. దాంతో కిలో మీటర్ పరిధిలో దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంపై సమాచారం అందడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది సుమారు ఐదు గంటల పాటు శ్రమించారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. దాంతో మరో రెండు అగ్నిమాపక యంత్రాలను మరో ఆరు వాటర్ ట్యాంకులను తీసుకువచ్చి మంటలను ఆర్పారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. కానీ పరిశ్రమలోని సుమారు రూ.60 లక్షల విలువైన సామాగ్రి తగలబడినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. అయితే సోమవారం రూ.50 లక్షల విలువైన ఆయిల్ కంటైనర్‌ను పరిశ్రమకు తీసుకువచ్చారని, అది పేలడంతోనే ఇంత ప్రమాదం జరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై అధికారికంగా ఏది తెలియలేదు. అయితే దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా ముంబైలో సోమవారం ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. పదో అంతస్థులోని అపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించి అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa