ఝార్ఖండ్ పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 14 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. జామ్తాడా జిల్లాలోని బరాకర్నదిలో ఫిబ్రవరి 24 సాయంత్రం పడవ ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాలించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. మృతదేహాలను వెలికితీసి పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం వాటిని బంధువులకు అప్పగించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మూడు రోజులు పాటు శ్రమించాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మహిళలు ఉన్నారని జామ్తాడా డిప్యూటీ కమిషనర్ ఫైజ్ అహ్మద్ ముంతాజ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఫిబ్రవరి 24న సాయంత్రం 6 గంటలకు బరాకర్నదిలో జామ్తాడా నుంచి నిర్సాకు వెళ్తున్న బోటు ప్రమాదానికి గురైంది. బలమైన ఈదురు గాలులు, వర్షమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదం నుంచి నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టారు. నదిలో గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీశారు. నదిపై వంతెన మరమ్మతులు జరుగుతుండటంతో ప్రజలు నది దాటేందుకు పడవలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి ప్రమాదాలను నివారించాలని కోరారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో వంతెన నిర్మాణాన్ని పరిశీలిస్తామని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa