చిలకలూరిపేట మండలంలోని కోమటినేనివారిపాలెం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతులు కోటయ్యస్వామికి మొక్కు చెల్లించేందుకు ప్రభను నిర్మించారు. స్వయంగా ప్రభను కొండకు తరలించి బుధవారం తిరిగి గ్రామానికి తీసుకువచ్చారు. 30 సంవత్సరాల క్రితం ఈ గ్రామం నుంచి కోటప్పకొండకు ప్రభను నిర్మించారు. నిర్వహణ భారంతో ఆ తర్వాత నుంచి ప్రభను నిర్మించడంలేదు. ప్రస్తుతం వర్క్ఫ్రమ్ హోం చేస్తున్న సాఫ్ట్వేర్ యువతులు రూ. 3 లక్షలతో ప్రభను నిర్మించారు. ఈ సందర్భంగా యువతులను గ్రామస్థులు ప్రశంసించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa