ట్రెండింగ్
Epaper    English    தமிழ்

100వ టెస్టు సందర్భంగా కోహ్లీకి శుభాకాంక్షల వెల్లువ

sports |  Suryaa Desk  | Published : Thu, Mar 03, 2022, 04:18 PM

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుల పరంపర ఇంకా ఆగలేదు. రేపు మొహాలీలో జరగబోయే ఇండియా-శ్రీలంక టెస్టు మ్యాచ్ తో 100 టెస్టుమ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలోకి చేరతాడు కోహ్లి.ఈ ఘనత సాధించిన 71వ ఆటగాడిగా,12వ భారత ఆటగాడిగా నిలవనున్నాడు కోహ్లి. 100 టెస్టులు ఆడటమంటే చాలా గొప్ప విషయం. ఆటగాడి జీవితంలో ఒక మైలురాయనే చెప్పాలి. ఈ సందర్భంగా సీనియర్ క్రికెటర్లు, తోటి క్రికెటర్లు, అభిమానుల నుండి శుభాకాంక్షలను అందుకుంటున్నాడు. భారత బ్యాటింగ్ దిగ్గజం,మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఒక వీడియో ద్వారా శుభాకాంక్షలను తెలిపాడు. తను 2007లో ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు మొదటిసారిగా విరాట్ పేరు విన్నానని,అప్పుడు విరాట్ అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్నాడని,విరాట్ గురించి టీంలో మాట్లాడుకోవటం విన్నానని, విరాట్ చాలా బాగా ఆడతాడని పేర్కొన్నాడు. టీం ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ "ఇది విరాట్ గర్వించదగిన ఘనత అని, ఈ సందర్భాన్ని ఆస్వాదించమని, ఆల్ ది బెస్ట్" అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మ్యాచులో శతకం సాధించి చిరస్మరణీయం చేసుకోవాలని భారత సీనియర్ క్రికెటర్ సునిల్ గవాస్కర్ విరాట్ కు సూచనలిచ్చారు. విరాట్ మాట్లాడుతూ ఈ సుదీర్ఘ ప్రయాణంలో 100 టెస్టుల వరకు రావడం గొప్పగా అనిపిస్తుందని చెప్పాడు. తన కుటుంబం,కోచ్ అభిమానులు గర్వపడే సమయం అని పేర్కొన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa