చంద్రబాబు హయాంలో బెల్టు షాపులు ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మించి పేద ప్రజలను దోచుకున్న టీడీపీ నేతలు నేడు మద్యం ధరలు గురించి మాట్లా డడం హాస్యాస్పదంగా ఉందని పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు. సోమవారం ఆయన లోకల్ యాప్ ప్రతినిధితో మాట్లాడుతూ వై స్సార్సీపీ ప్రభుత్వం కలీమద్యంపై ఉక్కుపాదం మోపిందన్నారు. ఈ రోజు వరకు కత్తీ మద్యంపై 13 వేల కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటు న్నారని తెలిపారు. విశాఖ డిస్టిలరీస్ అయ్యన్నపాత్రుడిది కాదా? పీఎంకే డిస్టలరీస్ యనమల రామకృష్ణుడు వియ్యంకుడిది కాదా? , శ్రీకృష్ణాడిస్టిలరీస్ ఆదికేశవుల నాయుడిది కాదా? ఎస్పీవై డిస్టిలరీస్ ఎస్పీవై రెడ్డిది కాదా? వీరంతా టీడీపీ వారు కాదా? వీటన్నింటికీ అనుమతి ఇచ్చింది చంద్ర బాబు కాదా? అని ప్రశ్నించారు.
2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి, ఒక బ్రూవరీకి సీఎం జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చేసే షో రాజకీయాలు చూసి ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. సహజ మరణాలను కూడా వక్రీకరించి టీడీపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందని విమర్శించారు. అక్రమ మద్యం నివారణ కోసం ప్రత్యేకంగా ఎబీ వ్యవస్థను తెచ్చి ఏ ప్రభుత్వాలు చెయ్యలేని పని వైస్సార్సీపీ ప్రభుత్వం చేసి చూపించిందన్నా రు. తమ ప్రభుత్వం 43 వేల బెల్ట్ షా పులను నిర్మూలించిందని, పర్మిట్ రూమ్లను రద్దు చేసిందని గుర్తు చేశారు. మద్యం వినియోగాన్ని తగ్గించా లన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి తపన, తాపత్రయం అన్నారు. అందుకే కట్టు దిట్టమైన ఆంక్షలు. పరిమిత వేళల్లోనే విక్రయమని తెలిపారు. ప్రభుత్వన్ని విమర్శించే అర్హత టిడిపి నాయకుల కి లేదని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa