జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల లోపు ఉన్న అన్ని టోల్ ప్లాజాలను వచ్చే మూడు నెలల్లో తొలగిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ప్రకటించారు.ఢిల్లీ-అమృత్సర్-కత్రా ఎక్స్ప్రెస్వేను కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీ-అమృత్సర్ సెక్షన్ ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని తెలిపారు. శ్రీనగర్-జమ్మూ రహదారి కత్రా-అమృత్సర్-ఢిల్లీ రహదారికి అనుసంధానించబడిందని చెప్పారు. 2024 నాటికి శ్రీనగర్-లేహ్ హైవేపై 11,650 అడుగుల ఎత్తైన జోజి లా కింద సొరంగం తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa