ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొలను భారతికి రూ5. 42 లక్షల ఆదాయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 09:17 AM

కొలను భారతి అమ్మవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ5, 42, 241 ఆదాయం లభించింది. మంగళవారం క్షేత్ర ప్రాంగణంలో ఆలయ ఈవో మోహన, కోడూరు ఈవో వేణునాథరెడ్డి పర్యవేక్షణలో గత ఏడాది 16-3-2021 నుంచి 22-3-22 వరకు అమ్మవారి హుండీలో భక్తులు సమర్పించిన నగదును లెక్కించగా రూ5. 42 లక్షల ఆదాయం లభించింది. ఇంత పెద్ద మొత్తం 2016 క్రిష్ణా పుష్కరాలకు మినహాయిస్తే ఆలయం దేవదాయ శాఖలో విలీనం తర్వాత  ఇదే ప్రథమమని ఆలయ అధికారులు చెబుతున్నారు.    ఈ హుండీ లెక్కింపులో సర్పంచ చంద్రశేఖర యాదవ్‌, ఉపసర్పంచ గోవిందు, వీఆర్‌వో బాబు మియా, ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ, సిబ్బంది గంగాధర్‌, కొత్తపల్లి రాజరాజేశ్వరి పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa