అన్ని వర్గాల ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేసిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గంగాధర నెల్లూరు మండలం కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు సురేష్ బాబు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ నరసింహులు , డిసిసి ఉపాధ్యక్షుడు భాస్కర్ రెడ్డి , వెంకటరమణ, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa