ఇక రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లుగా చెప్పక్కనే చెప్పారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. ఆజాద్కు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో కశ్మీర్కు చెందిన ఓ సంస్థ ఆయనను సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక సేవా కార్యక్రమాల దిశగా అడుగులు వేయనున్నట్టు సంకేతాలిచ్చారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో రాజకీయ పార్టీలు విఫలమైనప్పుడు సామాజిక సంస్థలే ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. ఇందుకోసం తాను రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ, ప్రస్తుతం తనలో అదే ఆలోచన ఉన్నట్టు చెప్పకనే చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత ఆజాద్ త్వరలోనే రాజకీయాలకు గుడ్బై చెబుతారన్న ప్రచారం జోరందుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa