ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడేళ్ల పాలనకు ప్రజలకు కానుకగా విద్యుత్ ఛార్జీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 01:12 PM

మొగల్రాజపురంలోని లోని టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వర రావు విలేకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొండా ఉమా మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం మూడేళ్ల పాలనకు ప్రజలకు కానుకగా విద్యుత్ ఛార్జీలు పెంచింది అన్నారు. జగన్ అసమర్థ పాలన వల్ల ప్రజలు వలస బాట పడుతున్నారు అని, మూడేళ్లల్లో నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులను పెంచారు ఇప్పుడు మల్లి విద్యుత్ చార్జీలు పెంచి పేదవాడి నడ్డి విరుస్తున్నారు అన్నారు. అన్ని రకాలుగా జగనన్న బాదుడే బాదుడు అనిపించారు అని, 2020, 21లో విద్యుత్ ఛార్జీలు, సర్ ఛార్జీలు పెంచారు. 


అది చాలక ఇప్పుడు మళ్లీ 1400కోట్ల రూపాయలు పేద వర్గాల పైనే భారం వేశారు అని, ఈ టారిఫ్ లను పరిశీలిస్తే తుగ్లక్ పాలన అంటే ఏంటో అర్ధం అవుతుంది అని తెలిపారు. ధనిక వర్గాలకు 55పైసలు పెంచి, పేద, మధ్య తరగతి వర్గాల పై 1. 55రూపాయలు పెంచారు అని మండిపడ్డారు. ఆరోజు జగన్ ఏం‌చెప్పాడు. ఇప్పుడు ఏం‌ చేశాడు. ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నారు. గతంలో చంద్రబాబు ను విమర్శిస్తూ ఇదే జగన్ పాటలు పాడాడు అనే విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అని, నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్ భారాలు మోపలేదు అని, సుపరిపాలనకు నిదర్శనం చంద్రబాబు పాలన స్పష్టం చేసారు. ధరల స్థిరీకరణ కోసం ఐదు వేల కోట్ల నిధులు పెడతామన్నావు ఏమైంది అని ప్రశ్నించారు. 


అదేమీ లేకపోగా. ఇష్టం వచ్చినట్లు గా భారాలు మోపడం సరికాదని అన్నారు. ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చావో ఒక్కసారి గుర్తు చేసుకో అన్నారు. అసత్య హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేసారని తుగ్లక్ పాలన లో కూడా ఈ స్థాయిలో భారాలు వేయలేదు అని అన్నారు. సంక్షేమ పధకాలు అమలు చేయలేకే ప్రజలను దోచుకుంటున్నారు అని, నీ అసమర్థత, చేతకానితనం వల్లే ఈ భారాలు మోపుతున్నారని, 1400కోట్లు కాకుండా మళ్లీ కరెంటు ఛార్జీలు పెరగనున్నాయి అని, గ్యాస్, పెట్రోల్ ధరల పై ఎపి జీయస్టీ ని ఎందుకు తగ్గించడం లేదు అన్నారు. ప్రజలు ఏమైపోయినా పర్లేదు నా ఆదాయం, నా‌ కమీషన్లు చాలు అని జగన్ భావిస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అనడానికి జగన్ పాలనే నిదర్శనం. ఒక్క ఛాన్స్ అన్న జగన్ కు ఇదే లాస్ట్ ఛాన్స్ అని ప్రజలు కూడా డిసైడ్ అయ్యారు అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం నిలుపుదల‌ చేయాలి అని డిమాండ్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa