వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. తూర్పులో నిర్వహి స్తున్న గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం ఐదో రోజు పటమట 12 వ డివిజన్ యార్లగడ్డ విధిలో సాగింది. అవినాష్ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురిం చి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం సుమారు రూ. లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని చెప్పారు. యార్లగడ్డ వారి వీధిలో సుమారు పది లక్షల రూపాయలతో కల్వర్టు నిర్మాణం చేశామని అభివృద్ధి చేశామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa