ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు కలక్టరేట్ వద్ద జనసైనికులు ఆందోళన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 03:48 PM

పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా గుంటూరు కలక్టరేట్ వద్ద జనసైనికులు ఆందోళన చేపట్టారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శుక్రవారం గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు బైక్ ర్యాలీలో కలక్టరేట్ వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపు ధర్నా పాయింట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలక్టరేట్ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని వారించడంతో, పోలీసులు నలుగురు ముఖ్య నాయకులను కలక్టరేట్ లోపలకు పంపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa