ట్రెండింగ్
Epaper    English    தமிழ்

14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. స్మగ్లర్లు కోసం గాలింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 03:51 PM

తిరుపతి డివిజన్ బాలపల్లి రేంజ్ రైల్వే కోడూరు మండలం లోని అన్నదమ్ముల బండ వద్ద అక్రమంగా తరలిస్తున్న 14 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పడేసి వెళ్లిన స్మగ్లర్లు కోసం గాలింపు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ సూచనలతో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి (ఏఆర్) కు చెందిన ఆర్ఎస్ఐ సురేష్ బాబు టీమ్ గురువారం నుంచి తిరుపతి అటవీ డివిజన్ లో కూంబింగ్ చేపట్టారు. వీరు శుక్రవారం ఉదయం అన్నదమ్ముల బండ చేరుకునే సమయానికి కొందరు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు దుంగలను పడేసి పారిపోయారు. వారి కోసం ఒక టీమ్ గాలిస్తుండగా, ఆ ప్రాంతంలో 14 ఎర్రచందనం దుంగలు లభించాయి. ఈ కేసును టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో సిఐ రామకృష్ణ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa