శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభం ముదురుతోంది. దేశాధ్యక్షుడు రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. తాజాగా అక్కడి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ సేవలు స్తంభించాయి. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. శనివారం అర్ధరాత్రి దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువరించింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, కరెంట్ కోతలపై ఆ దేశంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కిలో చికెన్ రూ.800లు, లీటర్ పెట్రోల్ రూ.250 ఇలా అన్ని ధరలూ ఆకాశాన్నంటుడడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా మంది భారత్కు శరణార్దులుగా వస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa