ఏపీ సీఎం జగన్ 13 కొత్త జిల్లాలను ప్రారంభించారు.కొత్త జిల్లాలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం ముందుగా పార్వతీపురం (ఉమ్మడి విజయనగరం) జిల్లాను ప్రారంభించారు.ఈ కొత్త జిల్లాల ప్రారంభంతో ఇప్పటివరకు 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల రాష్ట్రంగా రూపాంతరం చెందింది. ఆంధ్రప్రదేశ్లో 42 ఏళ్ల తర్వాత.. కొత్త జిల్లాల ఏర్పాటు జరగటం విశేషం. దీంతో ఇకపై ఏపీలో 26 జిల్లాలు,72 రెవెన్యూ డివిజన్లుగా మారింది. సీఎం జగన్ కొత్త జిల్లాలను ప్రారంభించటంతో ఇక ఏపీలో కొత్త జిల్లాల పాలన ప్రారంభమైంది.కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో సుస్థిర ప్రగతికి బాటలు వేసిన ప్రభుత్వం అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేయటానికేనని స్పష్టంచేసింది జగన్ ప్రభుత్వం.కొత్తపేట ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. కొత్తపేట రెవెన్యూ డివిజిన్ ఏర్పాటును కోరుకుంటున్నారని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. జగ్గిరెడ్డి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఎం వైఎస్ జగన్. తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
ప్రభుత్వ భవనాల్లోనే అత్యధిక శాతం కార్యాలయాలు. ఇప్పటికే సరిపడా అధికారుల, ఉద్యోగుల కేటాయింపులు జరిగాయి. కొత్త జిల్లాలతో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకువెళ్లనున్నారు సీఎం జగన్.సోమవారం ఉదయం 9.05 గంటలకు 26 జిల్లాల కలెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మిగిలిన శాఖల జిల్లా అధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలకింది.
చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుంచి మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది. జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రజల ఇంటి వద్దకు పాలన ద్వారా జవాబుదారీతనం ఇంకా పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది.పాలనాపరంగా పర్యవేక్షణ పెరగనుంది. అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత వేగంగా మరింత పారదర్శకంగా అమలు చేసే అవకాశం ఉంటుంది.
అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధికి బాటలు వేయొవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయ ప్రయాసలకోర్చి మైళ్ల కొద్దీ తిరిగే దుస్థితిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలు, వారి క్యాంపు కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీనికోసం కనీసం 15 ఎకరాల సువిశాల స్థలంలో మంచి డిజైన్లతో పది కాలాలపాటు గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం సాగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa