ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు ఢిల్లీకి సీఎం వై.ఎస్.జగన్...పలు అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 02:03 PM

రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించేందుకు  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రేపు సాయంత్రం 4.30 గంట‌ల‌కు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్రధానమంత్రి న‌రేంద్ర మోదీతో  ఆయ‌న భేటీ కానున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి విజ్ఞాపనలు చేస్తారు. అలాగే, త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లిసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ప‌లు అంశాల‌పై ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రిపే అవ‌కాశం ఉంది. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంపై కూడా జ‌గ‌న్ చ‌ర్చ‌లు జ‌ర‌పనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెండింగ్‌లో ఉన్న ప‌లు కార్య‌క్ర‌మాలు, ప‌నులపై కూడా ఆయ‌న చ‌ర్చిస్తారు. మోదీతో జ‌గ‌న్ భేటీకి ఏపీ సీఎంవో ఇప్ప‌టికే అపాయింట్‌మెంట్ తీసుకుంది. మ‌రోవైపు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జ‌గ‌న్ స‌మావేశం కోసం సీఎంవో అపాయింట్‌మెంట్ కోరింది. దీనిపై హోం శాఖ కార్యాల‌యం స్పందించాల్సి ఉంది. అమిత్ షా అపాయింట్ ఇస్తే ఆయ‌న‌తో కూడా జ‌గ‌న్ స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa