రష్యా దాడులతో ఉక్రెయిన్్ అతలాకుతలమవ్వడమే కాకుండా అందమైన నగరాలు శ్మశానాలను తలపిస్తున్నాయి. నగరాలు శవాల దిబ్బలుగా మారుతున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుచా నగరంలోని పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆ నగరంలో రష్యా సేనలు ప్రజలను ఊచకోత కోశాయి. దీనికి సంబంధించిన ఫొటోలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. బుచా నగరంలో ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయి. ఈ నగరం నుంచి రష్యా బలగాలు ఉపసంహరించుకున్నాక... అక్కడకు వెళ్లి చూసిన వారికి ఒళ్లు గగుర్పొడుస్తోంది. వందలాది మందిని రష్యన్ సైనికులు హతమార్చారు. చాలా మృతదేహాలను చూస్తే వారిని నేలపై పడుకోబెట్టి, చేతులు వెనక్కి కట్టి, తల వెనుక భాగం నుంచి కాల్చి చంపినట్టు తెలుస్తోంది. దాదాపు 300 మంది సాధారణ పౌరుల మృతదేహాలకు ఒకే చోట సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. వీరిలో ఒక పసిబిడ్డ కూడా ఉండటం గమనార్హం. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో వారిని రష్యా సైనికులు పొట్టనపెట్టుకున్నారని బుచా మేయర్ అనతోలి ఫెడొరికి ఆవేదన వ్యక్తం చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa