ఏపీకి చేసిన సాయంపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులతో ప్రస్థానం ప్రారంభించిన ఏపీని అన్ని విధాలుగా ఆదుకున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంటు వేదికగా ఓ కీలక ప్రకటన చేసింది. రెవెన్యూ లోటు భర్తీ కింద ఏపీకి ఏకగా రూ.28 వేల కోట్లను విడుదల చేశామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రాజ్యసభ సమావేశాల్లో భాగంగా కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఓ ప్రకటన చేశారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సంధించిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. 2015 నుంచి 2021 మధ్యలో ఏపీకి రెవెన్యూ లోటు కింద రూ.28 వేల కోట్లను విడుదల చేసినట్టు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. ఆర్థిక సంఘాల సిఫారసు మేరకే ఈ నిధులను విడుదల చేశామని కూడా ఆయన వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa