ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త జిల్లాల కుర్పూ...ఆ జంటలను చేర్చింది దగ్గరికి

national |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 01:44 PM

కొత్త జిల్లాలతో అందరికీ మేలు జరిగినా వెంటనే లబ్దిపొందిన వారిలో ఆ ఐఎఎస్, ఐపీఎస్ లు మాత్రం ఉన్నారని చెప్పవచ్చు. ఇదిలావుంటే ఏపీలో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. మంగళవారం (ఏప్రిల్ 4న) ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అధికారికంగా జిల్లాలు ప్రారంభమయ్యాయి. కొత్త జిల్లాల ఏర్పాటు..ఐఎఎస్, ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో అనుకోకుండా లక్కీగా భార్యాభర్తలు పొరుగున ఉన్న జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించారు. బాపట్ల, ప్రకాశం జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలుగా దంపతులే నియమితులు అయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్.. బాపట్ల జిల్లా కలెక్టర్ విజయలు భార్యాభర్తలు. వీరు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. దినేష్, విజయ దంపతులుప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌, బాపట్ల ఎస్పీ వకుల్‌ జిందాల్‌ కూడా దంపతులు. వీరు పొరుగున్న ఉన్న జిల్లాలకు నూతన సారథులుగా కొనసాగనున్నారు. మలికా గార్గ్ ఇప్పటికే ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఆమె భర్త వకుల్ జిందాల్ తాజాగా పొరుగునే ఉన్న జిల్లా ఎస్పీగా పోస్టింగ్ పొందారు. జిందాల్ ఇప్పటివరకు సీఎంవో కార్యాలయంలో సెక్యూరిటి అధికారిగా ఉన్నారు. మలికా, జిందాల్అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా భార్యాభర్తలు పొరుగు జిల్లాల్లోనే పోస్టింగ్ పొందారు. కాకినాడ జిల్లాకు కలెక్టర్‌గా కృతికా శుక్లాను ప్రభుత్వం నియమించింది. ఈమె 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన ‘ఏపీ దిశ చట్టం – 2019’ అమలుకు ప్రత్యేకాధికారిగా పనిచేస్తున్నారు. మహిళాభివృద్ధి- శిశు సంక్షేమ, దిశ ప్రత్యేక అధికారిగా సేవలందిస్తూ జిల్లాకు బదిలీపై వచ్చారు. శుక్లా దంపతులుకృతికా శుక్లా భర్త హిమాన్షు శుక్లా కోనసీమ జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. ఆయన కూడా 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. మొన్నటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా జేసీగా అభివృద్ధి- గ్రామ, వార్డు సచివాలయాల బాధ్యత చూస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చారు. మొన్నటి వరకు వివిధ హోదాల్లో ఉన్న అధికారులు.. ఇప్పుడు పొరుగున ఉన్న జిల్లాల సారథులుగా రావడం విశేషం. మరోవైపు ప్రస్తుతం 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 26 జిల్లాలు అయ్యింది. మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు అయ్యాయి. విస్తీర్ణపరంగా చూస్తే ప్రకాశం జిల్లా అతి పెద్దది.. తర్వాత అల్లూరి సీతారామరాజు, కడప జిల్లాలు నిలిచాయి. రాష్ట్రంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లాగా విశాఖపట్నం ఉంటే.. కోనసీమ జిల్లా తర్వాత స్థానంలో ఉంది. మరోవైపు అధిక జనాభా, మండలాలు కలిగిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా తొలి స్థానంలో నిలిస్తే.. ప్రకాశం జిల్లా రెండో స్థానంలో ఉంది. అలాగే జనాభా పరంగా చూస్తే.. నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, ఎన్టీఆర్‌ జిల్లాలు ముందు ఉన్నాయి. నేటి నుంచి అన్ని జిల్లాల్లో పాలన ప్రారంభమైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa