ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్ ప్రజల దైన్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న ఫోటో

international |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 05:53 PM

ఉక్రెయిన్‌లో ప్రజల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆ దేశంపై రష్యా చేస్తున్న యుద్ధంగా కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. చిన్నారులు, మహిళలు అని కూడా చూడకుండా రష్యా సైనికులు చేస్తున్న దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ వైపు బాంబులు వేస్తుంటే ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారు.

ఈ క్రమంలో తాము చనిపోయినా తమ పిల్లలు బ్రతికి ఉండాలనే కారణంతో చిన్న పిల్లల వీపుపై ఫోన్ నంబర్, కుటుంబ వివరాలను రాస్తున్నారు. దీనికి సంబంధించి బాధితులు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఫొటోను ఓ జర్నలిస్టు వెలుగులోకి తీసుకొచ్చాడు. దానిని ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి, వీపుపై అలా వివరాలను రాయడం వెనుక కారణాలను వివరించాడు. కనీసం తమ పిల్లలనైనా శరణార్థులుగా బ్రతికిస్తారని అలా చేస్తున్నట్లు తెలిపాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రాణభయంతో బతుకులు సాగిస్తున్న ఉక్రెయిన్ ప్రజల దైన్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa