ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక ఆ వాహనాలపై...పోలీసుల నజర్

national |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 04:03 PM

కేరళ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రంగు రంగుల లైట్స్‌ను వాడుతున్న వాహనదారుల భరతం పట్టేందుకు కేరళలోని మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఆపరేషన్ ఫోకస్ పేరుతో పది రోజుల పాటు ఈ డ్రైవ్‌ను నిర్వహించనున్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈ డ్రైవ్‌లో వాహనాలకు కలర్ ఫుల్ లైట్స్‌ను వాడేవారిపై చర్యలు తీసుకోనున్నారు.


కలర్‌ఫుల్ హెడ్ లైట్స్‌తో పాటు వాహనాలకు పార్కింగ్ లైట్స్, ఇండికేటర్ లైట్స్ లేకపోయినా, నాయిస్, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ వస్తున్నా, లైట్ల వెలుతురులో నెంబర్ ప్లేట్లు కనిపించకపోయినా జరిమానా విధించనున్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా సాయంత్రం ఏడు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు తనిఖీలు నిర్వహిస్తారు.


ఈ ఫ్యాన్సీ లైట్లు కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా " అదనపు లైట్ల వాడకం తీవ్రమైన సమస్య. లైట్ల సురక్షిత వినియోగాన్ని అమలు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఈ డ్రైవ్‌ను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది" అని అదనపు రవాణా కమిషనర్ ప్రమోజ్ శంకర్ తెలిపారు. నిజానికి కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేటర్స్ అసోసియేషన్ వాహనాలకు అదనపు లైట్లను ఉపయోగించకూడదని కోరింది. కానీ యువత తమ వాహనాలకు అదనపు లైట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.


అదేవిధంగా ఇటీవల కేరళలోని కన్నూర్‌కు చెందిన ఒక టూరిస్టు బస్సు గోవాలో అగ్ని ప్రమాదానికి గురైంది. దీనిపై విచారించగా బస్సుకు సంబంధించిన ఒరిజినల్ వైర్లను మార్చి, అదనపు లైట్లను ఏర్పాటు చేయడవల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అదనపు లైట్లను వాడుతున్న వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు ఆపరేషన్ ఫోకస్ పేరుతో డ్రైవ్‌ను చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa