ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంగళగిరిలో పాగాకు...నారా లోకేష్ ప్రయత్నాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 01:47 PM

ఎక్కడ ఓడమో అక్కడే గెలవాలని అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భావిస్తున్నారు. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తానని.. తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండని నియోజకవర్గ ప్రజలను తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్.. స్థానిక ప్రజలతో మమేకం అయ్యారు. ఇంటింటికీ స్వయంగా తిరిగి.. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోకేష్ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఈ మూడేళ్లలో జగన్ కేబినెట్ ఏం పీకిందంటూ లోకేష్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఇప్పటి వరకు మంత్రివర్గం చేయలేనిది.. కొత్త వచ్చే కేబినెట్ ఏం పీకుతుందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయనలో రౌడీ లక్షణాలు పెరిగాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గం కోసం ఏం పీకావ్ రామకృష్ణారెడ్డి అంటూ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తాము అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఎంతో చేశామని తెలిపారు. ఇక్కడ ఎన్నో రోడ్లు వేశామని, డ్రైన్లు నిర్మించామని చెప్పారు. టీడీపీ నాయకులపై కేసులు పెట్టడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. ఇదిలావుంటే లోకేష్ మంగళగిరి నియోజకవర్గం పర్యటనలో ఉండగానే చీకటి పడ్డాక కురగల్లు గ్రామంలో కరెంట్ పోయింది. దీంతో లోకేష్ లాంతర్ చేతబట్టి గ్రామంలో పర్యటన కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో చీకటి అలుముకుందని దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa