ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుపైకి ఎద్దు...ఆ కానిస్టేబుల్ పై అమాంతంగా దాడి

national |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 01:50 PM

అది ఢిల్లీలోని... దయాల్పూర్‌లో ఉన్న షేర్పూర్ చౌక్. అక్కడి రోడ్డు ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. కార్లు, బైకులూ అటూ ఇటూ రాకపోకలు సాగిస్తూనే ఉంటాయి. అలాంటి చోట డ్యూటీ చెయ్యడం చాలా కష్టం. కానీ అక్కడ పోలీస్ కానిస్టేబుల్ జ్ఞాన్ సింగ్ డ్యూటీ చేస్తున్నాడు. యూనీఫామ్‌లోనే ఉన్నాడు. ఏదో బిజీలో ఉన్నట్లు కనిపించాడు. రోడ్డు మధ్యలో ఉన్న అతను మొబైల్ చూసుకుంటూ... క్రమంగా వెనక్కి జరుగుతూ ఉండగా... ఓ బలమైన ఎద్దు అతన్ని కొన్ని అడుగుల దూరం నుంచి చూసింది. దాన్ని ఆయన చూడనే లేదు. ఆ ఎద్దు ఏమనుకుందో ఏమో... ఒక్కసారిగా వచ్చి... కొమ్ములతో గాల్లోకి ఎగరేసి కిందపడేసింది. ఊహించని ఈ పరిణామంతో... ఆయన గాలిలో ఎగిరి ఒక్కసారిగా కింద పడ్డాడు. దాంతో తలకు గాయమైంది. అది చూసిన ఓ ముసలాయన దగ్గరకు వెళ్దామని ప్రయత్నించి... ఆ ఎద్దు అక్కడే ఉండటంతో... వెళ్లలేకపోయాడు. ఇంతలో మరో పోలీస్, స్థానికులు వచ్చి... కానిస్టేబుల్‌ని పైకి లేపారు. సాయంత్రం వేళ జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరా (CCTV camera)లో రికార్డ్ అయ్యింది. ఆ ఎద్దు ఎదురుగా వచ్చి ఉంటే... తప్పించుకునేవాడేమో... వెనక నుంచి రావడం వల్ల జరగబోయే ప్రమాదాన్ని ముందుగా కనిపెట్టలేకపోయాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా... ట్రీట్‌మెంట్ చేసి.. డిశ్చార్జి చేశారు. ట్విట్టర్‌లోని @SansaniPatrakar అకౌంట్‌లో ఏప్రిల్ 2న ఈ వీడియోని పోస్ట్ చేశారు. దీనిపై యూజర్లు బాగా స్పందిస్తున్నారు. "ఢిల్లీ సుప్రీం మేయర్, దేశ హోంశాఖ మంత్రి ఆ కానిస్టేబుల్‌కి క్షమాపణ చెప్పాలి. జంతువులు ఇలా రోడ్లపై లేకుండా చూడాలి" అని ఓ యూజర్ కోరారు. "ఈ ఘటనలో చాలా తప్పులు కనిపిస్తున్నాయి. పోలీసుల దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదు. ఎమర్జెన్సీ కేర్ లేదు" అని మరో యూజర్ స్పందించారు. "డ్యూటీలో ఉంటూ మొబైల్ చూసుకుంటున్నందుకు ఇది సరైన పనిష్మెంట్. ఆ ఎద్దుకు సెల్యూట్" అని మరో యూజర్ కామెంట్ ఇవ్వగా... "ఆవుల్ని పూజిస్తూ.. వాటిని ఇలా రోడ్లపై వదిలేసేవారికి పనిష్మెంట్ ఇవ్వాలి" అని మరో యూజర్ కోరారు. రోడ్లపైకి పిల్లల్ని పంపించే పేరెంట్స్ ఇలాంటి విషయాలపై పిల్లలకు కొంత అవగాహన కలిగించాలి. జంతువుల జోలికి వెళ్లొద్దనీ.. వాటిని రెచ్చగొట్టకుండా దూరంగా ఉండాలని తగిన జాగ్రత్తలు చెబితే మంచిదే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa