ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా ఆ తల్లికి కోడుకే మరి

national |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 02:03 PM

ఢిల్లీకి రాజైనా ఓ అమ్మకు కొడుకే అన్న ఘటన పంజాబ్ లో ఆవిష్కతమైంది. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం ఒక ఎత్తైతే.. ఓ స్వీపర్ కుమారుడు ఏకంగా ముఖ్యమంత్రినే ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నాడు. కాంగ్రెస్ అభ్యర్థి చరణ్జీత్ సింగ్ చన్నీపై విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు లభ్ సింగ్ ఉగోకే. అయితే, లభ్ సింగ్ తల్లి ఓ పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన తన తల్లి స్వీపర్‌గా పనిచేస్తున్న పాఠశాలకే ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే, ఈ కార్యక్రమానికి ఆమె దూరంగా ఉన్నారు. సత్కారం ముగిసిన తర్వాత తల్లి దగ్గరకు వెళ్లి ఆ ఎమ్మెల్యే ఫోటో దిగారు.


కుమారుడు ఎమ్మెల్యే అయినా.. లభ్ సింగ్ తల్లి బల్దేవ్ కౌర్ మాత్రం స్వీపర్ వృత్తిలోనే కొనసాగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 25 ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదలిపెట్టేబోనని ఆమె స్పష్టం చేశారు. తన కొడుకు ఎమ్మెల్యే అయినా తాను స్వీపర్ పనినే చేస్తానని పేర్కొన్నారు. ‘‘లభ్ సింగ్ కచ్చితంగా మార్పులు తీసుకొస్తాడనే నమ్మకం నాకుంది.. అందరికీ వైద్యం, విద్య అందజేస్తాడు.. నా కొడుకు ఎమ్మెల్యే అయినా ఏళ్లుగా తాను చేస్తున్న పనిని కొనసాగిస్తాను. ఎన్నికలో గెలుపై లభ్ సింగ్ మొదటి నుంచి ధీమాగా ఉన్నారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు.


‘‘నా కుమారుడు ఎమ్మెల్యే అయినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది.. సంపాదన కోసం మేము కష్టపడి పనిచేస్తూనే ఉంటాం.. నా కొడుకు ఎమ్మెల్యే అయినా నేను మాత్రం స్వీపర్‌ వృత్తిని కొనసాగిస్తాను’’ అని అన్నారు. ఇంటి దగ్గర ఇక, పేదలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా తన కుమారుడు పనిచేయాలని కోరుకుంటున్నానని లభ్ సింగ్ తండ్రి దర్శన్ సింగ్ అన్నారు. కాగా, లభ్ సింగ్ ఇదే పాఠశాలలో చదువుకున్నారని, కొంతకాలం కిందట వరకు మొబైల్ రిపేరింగ్ షాప్లో పనిచేశారని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ అమ్రిత్ పాల్ కౌర్ తెలిపారు.


‘‘నేను ఎమ్మెల్యే అయితే ఏంటి?.. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ సంపాదనే కుటుంబానికి ఆసరగా ఉండేది.. ఆమెకు వచ్చే తక్కువ జీతంతోనే ఇంటికి సామాన్లు కొనుక్కునేవాళ్లం.. ఇప్పుడు మా అమ్మకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు ఎందుకంటే ఎమ్మెల్యేగా నాకు జీతం వస్తోంది.. నా భార్య టైలరింగ్ చేసి కొంత సంపాదిస్తోంది.. కానీ, అమ్మ మాత్రం తన ఉద్యోగాన్ని వదులుకోడానికి సిద్ధంగా లేదు.. ప్రజాప్రతినిధిగా నా హోదా ఆమె దారికి అడ్డంకి కాదు’’ అని ఎమ్మెల్యే అన్నారు.ఇటీవల ఎన్నికల్లో భదౌర్ నియోజకవర్గంలో చరణ్‌జీత్ చన్నీపై 37వేల ఓట్లకు పైగా మెజారిటీతో లభ్‌ సింగ్ విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆయన స్వగ్రామంలోని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.. తాము ఈ విజయాన్ని నమ్మలేకపోతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన లభ్ సింగ్.. నిరంతర కృషితో కొద్దికాలంలోనే కీలక నేతగా ఎదిగారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 92 సీట్లలో విజయం సాధించిన ఆప్.. తొలిసారి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa