ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీయల్: 5 ఓవర్స్ లలో రెండు వికెట్స్ కోల్పోయి 38 పరుగులు చేసిన పంజాబ్

sports |  Suryaa Desk  | Published : Fri, Apr 08, 2022, 07:53 PM

 పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పంజాబ్ కింగ్స్ 5 ఓవర్స్ లలో రెండు వికెట్స్ కోల్పోయి 38 పరుగులు చేసింది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ జట్టు రెండింటిలోనూ గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఆ జట్టులో బ్యాటర్లు, బౌలర్లు, నాణ్యమైన ఆల్ రౌండర్లు ఉన్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య బ్యాటింగ్, బౌలింగ్‌లో జట్టుకు తన సేవలు అందిస్తున్నాడు.

బ్యాటింగ్ విషయంలో మాథ్యూ వేడ్, డేవిడ్ మిల్లర్, శుభ్‌మన్ గిల్ తివాతియా వంటి హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్‌లో రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, లాకూ ఫెర్గ్యూసన్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నారు. పంజాబ్ జట్టు విషయానికొస్తే కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌తో పాటు బెయిర్ స్టో, శిఖర్ ధావన్, లియామన్ లివింగ్ స్టోన్ వంటి నాణ్యమైన బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్‌ భారాన్ని రబాడా, రాహుల్ చాహర్ వంటి వారు ప్రధానంగా మోస్తున్నారు. ఇరు జట్లలలోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్న క్రికెటర్లకు కొదువ లేదు. దీంతో ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.

పంజాబ్ కింగ్స్ తుది జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), జితేష్ శర్మ, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు: మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, దర్శన్ నల్కండే






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa