ప్రతి గ్రామ వాలంటీర్ సేవా వజ్రమేనని అవనిగడ్డ ఎమ్యేల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కోన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో గ్రామ వాలంటీర్లకు పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్యేల్యే రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా ప్రతి కుటుంబానికి అవసరమైన సర్టిఫికెట్లు, ఇళ్ళ స్థలాలు ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా నేరుగా గ్రామ నచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న ఘనత వాలంటీర్లదే అన్నారు. కోవిడ్ సమయంలో హెూం ఐసోలేషన్లో ఉన్న ప్రతి కోవిడ్ బాధితుని ఇంటికి వెళ్ళి మందులు ఇచ్చిన వాలంటీర్లు న్పూర్తి ప్రధాతలని అన్నారు. త్వరలో ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజలనుంచి మరిన్ని సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేద్దామని వాలంటీర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు వర్తింప చేస్తుందన్నారు. గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, ఈ సేవలు రాష్ట్రం వైపు దేశంలోని అన్ని రాష్ట్రాలు అసక్తిగా చూస్తున్నాయని అన్నారు. అనంతరం గ్రామ వాలంటీర్లకు పురస్కారాలు ప్రధానం చేశారు. ఏపీ ఆగ్రో ఇండస్ట్రీన్ కార్పోరేషన్ డైరక్టర్ మేరుగు ఝాన్సిలక్ష్మీ, జడ్పీటీసీ రాజులపాటి కళ్యాణీ, వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు మోపిదేవి ధ్వారకానాధ్, మండల పార్టీ అధ్యక్షుడు వేమూరి గోవర్ధనరావు, సర్పంచ్లు పైడిపాముల కృష్ణకుమారి, తోట శ్రీనివాసరావు, గొ రిపర్తి సురేష్, మాతంగి రమ్య, డొక్కు నాగేశ్వరరావు, కొల్లూరి కోటేశ్వరరావు, వల్లూరి ఉమా, ఎంపీటీసీలు, అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa