విధుల్లో సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి హెచ్చరించారు. శనివారం అక్కారంపల్లి లో గల మస్టర్ (కార్మికుల హాజరు ) కేంద్రాన్ని కమిషనర్ తనిఖీ చేశారు. అలాగే వినాయకసాగర్, న్యూ బాలాజీ కాలనిలో గల ట్రాన్స్ పర్ స్టేషన్ ను పరిశీలించారు. ఉద్యోగుల హాజరు నమోదు పట్టికను పరిశీలించారు. రావాల్సిన సమయానికి కొంత మంది డ్రైవర్లు, సిబ్బంది రాకపోవడాన్ని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి ని ఆదేశించారు. సిబ్బంది అందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి హాజరై విధులు నిర్వహించాలన్నారు. సమయ పాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం తూకివాకం వద్ద గల ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ (చెత్త నిర్వహణ కేంద్రం) ను పరిశీలించారు. తడి, పొడి చెత్త నిర్వహణ, మురుగు నీటి శుద్ధి కేంద్రం, చెత్త నుండి గ్యాస్ ఉత్పత్తి కేంద్రం, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ గూర్చి ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్ వివరించారు. చెత్త నిర్వహణ ఇంకా బాగా చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa