ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భావితరలా భవిష్యత్తును దొంగలించేస్తున్నారు: నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 09, 2022, 02:46 PM

రాబోవు భావి తరాల భవిష్యత్ ను ఈ ప్రభుత్వం దొంగలించేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. బీహార్ లో 500 టన్నుల స్టీల్ బ్రిడ్జిని దోచేసిన ఘటనతో ఏపీ ప్రభుత్వాన్ని పోల్చారు. బీహార్ లోని ఆరా సోనె కెనాల్ మీద బీహార్ ప్రభుత్వం నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని దొంగలు మొత్తం విప్పేసి దోచుకెళ్లిపోయారు. దానికి సంబంధించిన వార్తను పేపర్ కటింగ్ తో పోస్ట్ చేసి, సీఎం జగన్ పై లోకేశ్ విరుచుకుపడ్డారు. 


ఆ స్టీల్ బ్రిడ్జి దొంగతనం లాగానే సీఎం జగన్ కూడా తన పిచ్చి, అవినీతి, అరాచకాలు, అసమర్థతతో రాబోయే తరాల భవిష్యత్ ను దొంగిలించేస్తున్నారని మండిపడ్డారు. ఎంతో వెనుకబడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ గాడిలో పెట్టాలంటే ఇంకెంత కాలం పడుతుందో ఊహించుకోవడం కష్టమని ఆయన విమర్శలు గుప్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa