ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ర ఇస్తే...ప్రజలు ఫ్యాన్ తిప్పుకొంటారు: నాగ బాబు ఎద్దేవా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 09, 2022, 02:47 PM

రాష్ట్రంలో విద్యుత్ కోతల కారణంగా ఫ్యాన్లు తిరగడంలేదని తస్మదీయులు కర్ర  ఇస్తే వాటితోనైనా ఫ్యాన్లు తిప్పుకొంటారని జనసేన నేత నాగ బాబు విమర్శలు గుప్పించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్ కోత‌ల‌పై జ‌న‌సేన నేత నాగ‌బాబు స్పందిస్తూ ప్ర‌భుత్వ తీరును ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. 'ఏపీలో విద్యుత్ కోతలకు ఫ్యాన్ తిరగటం లేదు. తస్మదీయులు ప్రజలకి ఒక కర్ర ఇస్తే, ఆ కర్రతో ఆయినా ఫ్యాన్ తిప్పుకుంటారు. ఎందుకంటే ఫ్యాన్ తిరక్కపోతే తస్మదీయులకు కూడా ఇబ్బందే!' అని నాగ‌బాబు చుర‌క‌లంటించారు. 


ఇదిలావుంటే టీ టైం అవుట్ లెట్ వ్యవస్థాపకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జ‌న‌సేన‌లో చేరార‌ని నాగ‌బాబు చెప్పారు. 'తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త, టీ టైం అవుట్ లెట్ వ్యవస్థాపకుడు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 17 రాష్ట్రాల్లో 3 వేల టీదుకాణాలు స్థాపించి 20 వేలమందికి పైగా ఉపాధి కల్పించారు. ఏ రాజకీయశక్తులకు తలొగ్గకుండా జనంకోసం పనిచేస్తున్న జనసేనలో చేరడం జన సైనికులకు స్ఫూర్తినిచ్చే అంశం' అని నాగ‌బాబు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa