జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 12వ తేదీన అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరపున రూ.లక్ష చెక్కులను అందజేయనున్నారు. ఈ వివరాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్రెడ్డి వెల్లడించారు. ఈ నెల 12న సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గంలో కొత్త చెరువుకు చేరుకుంటారని మధుసూదన్ రెడ్డి తెలిపారు. అక్కడి నుంచి ధర్మవరం పట్టణంలోని శివనగర్, గొట్లూరు, బత్తలపల్లి మండలాల్లో పర్యటిస్తారు. పరామర్శించిన అనంతరం రైతు ముఖాముఖి కార్యక్రమంలో అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని మధుసూదన్ రెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa