ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ : సన్‌రైజర్స్ టార్గెట్ 163 పరుగులు

sports |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 09:33 PM

ఐపీఎల్‌లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానం వేదికైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు తీసి 162 పరుగులు ఇచ్చింది.అయితే  ఐపీఎల్ తాజా సీజన్ లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో భారీ స్కోరు చేయలేకపోయింది. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్‌ను సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుతంగా నియంత్రించారు. ఫీల్డర్లు వరుస క్యాచ్‌లు జారవిడుచుకున్నప్పటికీ బౌలర్లు బంతిని సరైన స్థానాల్లో ఉంచి గుజరాత్ బ్యాట్స్‌మెన్‌ను ఆదుకున్నారు. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్య 42 బంతుల్లో 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, నటరాజన్ 2 వికెట్లు, మార్కో జాన్సెన్ 1 వికెట్, ఉమ్రాన్ మాలిక్ 1 వికెట్ తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa