ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రెండు కేసులు..కరోనా విముక్తి దిశగా పయనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 12:24 AM

కరోనా వైరస్ విముక్తి దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పయనిస్తోంది. ఏపీలో ఒకటీ అరా కేసులు తప్ప కరోనా వ్యాప్తిపై ఆందోళనకర పరిస్థితి ఏమాత్రం లేదు. గడచిన 24 గంటల్లో 1,988 కరోనా పరీక్షలు నిర్వహించగా, 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 16 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.  ఏపీలో ఇప్పటివరకు 23,19,614 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,841 మంది ఆరోగ్యవంతులయ్యారు. కేవలం 43 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,730 మంది కరోనాతో మరణించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa