బీసీలను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారు అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. వైయస్ కుటుంబానికి బలహీనవర్గాలంటే ముందు నుంచి కోపముందని ఆయన అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా బలహీనవర్గాలను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నారని మండిపడ్డారు. బీసీ నేతలతో టీడీపీ కార్యాలయంలో ఆయన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, బలహీనవర్గాలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిన ఘనత జగన్ దని అన్నారు. గతంలో బీసీ ఫెడరేషన్లు పెట్టి వైయస్ పైసా నిధులు కూడా ఇవ్వలేదని... ఇప్పుడు జగన్ బీసీ కార్పొరేషన్లు పెట్టి, వాటి నిధులను కూడా లాక్కొని మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ముగ్గురికి పంచారని... ఈ మూడేళ్లలో బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa