ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో మంత్రి పదవి దక్కలేదన్న భావనలో అలక బూనిన తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి వ్యవహారం ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్కు దగ్గరి బంధువు అయిన బాలినేనికి సర్దిచెప్పేందుకు జగన్ తరఫున నిన్నటి నుంచి సాగుతున్న యత్నాలు సోమవారం సాయంత్రానికి గానీ ఓ కొలిక్కి రాలేదు. ఆదివారం రెండు సార్లు వైసీపీ కీలక నేత, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన ఇంటికి వచ్చినా బాలినేని శాంతించని విషయం తెలిసిందే.
అయితే బాలినేనిని తన వద్దకు తీసుకురావాలంటూ స్వయంగా జగన్ ఆదేశించడంతో సోమవారం మూడో మారు బాలినేని ఇంటికి సజ్జల వెళ్లారు. సుదీర్ఘంగా చర్చించిన మీదట జగన్ను కలిసేందుకు బాలినేని సమ్మతించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. బాలినేని ఇంటి వద్ద ఆదివారం నుంచి టీడీపీకి దూరంగా జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కనిపించి అందరి దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు. తాజాగా జగన్ ఇంటికి బాలినేని బయలుదేరగా... ఆయన వెంట కరణం కూడా వెళ్లారు. బాలినేనితో చర్చల్లో కరణం కీలక భూమిక పోషించారు అన్న ప్రచారం సాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa