ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా.. లేక మామూళ్ల మత్తులో ఉన్నారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 11:08 AM

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం ఎర్రబాలెం గ్రామంలో ముంపు ప్రాంత కాలనీలకు ఇచ్చిన స్థలాలలో ఆ ప్రాంత ప్రజలు ఇల్లు కట్టుకున్నారు. ముంపు ప్రాంతం కింద85 లక్షల వ్యయంతో సైడ్ కాలవలు, సిమెంట్ రోడ్లు మంజూరు అవటంతో గుత్తేదారులు నాసిరకంగా రోడ్లు వేసిన నేపథ్యంలో లోకల్ యాప్ లో, వార్తాపత్రికలలో కథనాలు ప్రచురితమయ్యాయి. అయినా సంబంధిత అధికారుల లో మాత్రం చలనం లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకపక్క నాసిరకంగా రోడ్లు వేసి గుత్తేదారులు జేబులు నింపు కుంటే సంబంధిత అధికారులు నిద్రమత్తు లో ఉన్నారా? లేక మామూళ్ల మత్తులో ఉన్నారా అనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామంలోని ప్రజలు కోరుతున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa