ఏపీలో పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు అందించే విద్యుత్పై సర్కారు పన్ను పెంచింది. ఇప్పటి వరకు యూనిట్కు పన్ను 6 పైసలు విధిస్తుండగా, దానిని ప్రస్తుతం రూపాయికి పెంచింది. ఇప్పటికే పవర్ హాలిడే అమలు చేస్తుండడంతో పరిశ్రమలు కుదేలవుతున్నాయి. వారంలో ఐదు రోజులు మాత్రమే పరిశ్రమలు నడవాలని, మూడు షిఫ్టుల్లో పని చేసే పరిశ్రమలు రెండు షిఫ్టుల్లో మాత్రమే పనిచేయాలనే ఆదేశాలు అందాయి. కరోనా కారణంగా ఆర్థిక నష్టాల్లో ఉన్న పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలు తమకు ఇబ్బందిగా మారాయని పరిశ్రమల యజమానులు భావిస్తున్నారు. ఇటీవల 2022-23 విద్యుత్ టారిఫ్ను ఏపీఈఆర్సీ (రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి) సవరించింది. ఆ సమయంలో గృహ విద్యుత్ వినియోగదారులపై యూనిట్ ఛార్జీలను పెంచారు. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ టారిఫ్లో మార్పులు చేయలేదని పరిశ్రమల యజమానులు ఊరట చెందారు. తాజాగా విద్యుత్ సుంకం పెంపుతో వారికి కూడా షాక్ తగిలింది. గృహ వినియోగదారుల యూనిట్కు 6 పైసలు చొప్పునే సుంకం విధిస్తుండగా, వ్యవసాయ విద్యుత్కు మాత్రం పూర్తిగా సుంకం మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అందజేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa