ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎండుమిర్చి ధర మండుతోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 08:53 AM

మార్కెట్లో నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పేరు చెప్పి వంటింట్లో వాడే ఆయిల్ ధరలను వ్యాపారులు ఇష్టారాజ్యంగా పెంచేశారు. గ్యాస్, పెట్రోలు ధరలు భగభగమంటున్నాయి. ఇక ఇళ్లల్లో కూరలు, అవకాయకోసం వాడే ఎండుమిర్చి ధరలు మండిపోతున్నాయి. గతేడాది తుఫాను, భారీ వర్షాల కారణంగా మిర్చి పంటకు అపార నష్టం వాటిల్లింది. దీంతో ఈ ఏడాది మిర్చి దిగుబడులు తగ్గడంతో మార్కెట్లో ఎండు మిర్చి ధర అంత కంతకూ పెరుగుతోంది. మార్కెట్ లో గత నెలలో ఎండుమిర్చి ధర కిలో రూ. 200 ఉండగా ఇవాళ రూ. 250-300 మధ్య ఉంది. ఆవకాయ మిరపకాయ ధర గతంలో కిలో రూ. 300-400 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు రూ. 600 పలుకుతోంది. అలాగే పచ్చడికి వాడే గానుగ నూనె కిలో రూ. 300 నుంచి రూ. 350కి పెరిగింది. మొత్తం మీద బజారులో ఎండుమిర్చి, అయిల్ ధరలు సామాన్యుల పాలిట పెనుభారంగా మారాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది కూడా పచ్చడి మెతుకులు తినడం కష్టమేనేమో అనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa