ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైక్రోసాఫ్ట్ సీఓఓగా భారతీయ మహిళ

national |  Suryaa Desk  | Published : Wed, Apr 13, 2022, 08:56 AM

మైక్రోసాఫ్ట్ ఇండియా మన దేశంలో కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా ఇరినా ఘోస్‌ నియమితులయ్యారు.


ఇప్పటివరకు భారతదేశంలోని కంపెనీ క్లౌడ్ సొల్యూషన్స్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె విధులు నిర్వర్తించారు. 15 ఏళ్లుగా కంపెనీలో విధులు నిర్వర్తించిన రాజీవ్ సోధి స్థానంలో ఘోస్ నియమితులయ్యారు. ఘోస్ రెండు దశాబ్దాలకు పైగా మైక్రోసాఫ్ట్ ఇండియాలో పని చేస్తున్నారు. హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్, విప్రోలో ఆమె పని చేశారు. అనంతరం డిసెంబర్ 2001లో మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో చేరారు. 2010లో ఆమె మైలిటిల్‌బిట్‌ను స్థాపించారు. భారతదేశంలోని వెనుకబడిన బాలికలకు విద్య, ఉపాధిని అందించడంపై ఈ ఫౌండేషన్ దృష్టిసారిస్తుంది. ఆమె ఐఐటీ వారణాసి నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పట్టభద్రులయ్యారు. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ నుంచి ఎంబీఏ చేశారు. ఆమె సంగీత ప్రియురాలిగా సన్నిహితులు చెబుతుంటారు. ఇక మారథాన్ రన్నర్‌గా కూడా ఆమె ప్రతిభ చాటారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa