యల్లనూరు మండల పరిధిలోని వెన్నెపూసపల్లి గ్రామంలోని రైతు భరోసా కేంద్రం నుండి 130 బస్తాలు డిఎపి ట్రాక్టర్ లో తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ట్రాక్టర్ ను డిఏపి బస్తాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిణి కాత్యాయని వివరణ కోరగా వెన్నెపూసపల్లి రైతు భరోసా కేంద్రంలో సుమారు 140 టన్నుల స్టాకు వుందన్నారు. అందులో భాగంగానే మంగళవారం 12మంది రైతులకు 130 బస్తాలు ఎంపిఇఓ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పోలీసులు విచారణ అనంతరం రైతులకు తిరిగి అందిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa