కరోనా మహమ్మారి చైనాలో విలయ తాండం చేస్తోంది. ఆ దేశంలో పది రోజులుగా భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఏ.2 కారణంగా మంగళవారం కొత్తగా 23,000 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా రోజుకు 20 వేల కేసులు వెలుగు చూస్తుండడంతో చైనా సర్కారు నడుం బిగించింది. 23 నగరాలలో కఠిన లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తోంది. కోవిడ్-19 కేసుల దృష్ట్యా ఒక వ్యక్తిని రోజుకు రెండుసార్లు పరీక్షిస్తున్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా 50 వేల సిబ్బందిని ప్రభుత్వం వినియోగిస్తోంది. ముఖ్యంగా షాంఘై నగరంలో కఠిన ఆంక్షలు వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యావసరాలు పొందడం కూడా కష్టతరమవుతోంది. ఇక ఒకే ఇంట్లో ఉంటున్న వారంతా దగ్గరగా మెలగకూడదని, భార్యాభర్తలైనా దూరంగా ఉండాల్సిందేనని ప్రభుత్వం సూచిస్తోంది. ముద్దు కూడా పెట్టుకోకూడదని ప్రభుత్వం చేసిన హెచ్చరికలతో అక్కడి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కోవిడ్ను కట్టడి చేసేందుకే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa